తెలుగు సంగతులు

శుక్రవారం, నవంబర్ 07, 2008

గర్జనలు

అందరూ గర్జించే వాళ్ళే ! ఓట్లు అర్దించే వాళ్ళే బెటరేమో కదా! ప్రజా గర్జనలో ప్రజల మాట్లాడింది లేదు.ప్రజలంటే నాగ బాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే అయితే అది ఓకే.
యువ గర్జనలో యువకులెవ్వరు వేదిక పైన లేనే లేరు. బాబు,హరి కృష్ణ, బాలకృష్ణ యువకులైతే మరి నేను నాకు జస్ట్ ౫౫ మాత్రమే!
ఇక ఇందిరమ్మ సంబరాలు -- అయ్యన్ని మరి సిత్రాలు. వచ్చిన జనం లాగా లేరు-- తెచ్చిన జనమే!
ఇంతమంది ప్రజా, యువ,జన శక్తులు, సమయం, వీటి కోసమే వృధా అయితే ఎలాగా చెప్పండి?

కామెంట్‌లు లేవు: